మహాలక్ష్మీ స్కీమ్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ టికెట్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. “ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలని, వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్టర్ (ఎక్స్) రాసుకొచ్చారు. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. రూ.300 చెల్లించి ఫ్యామిలీ-24 టికెట్ కొంటే.. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు హైదరాబాద్లో 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది. టీ-6 టికెట్కు రూ.50 చెల్లించి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అంటే ఆరు గంటల పాటు హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఇన్నాళ్లు అమలైంది.
ఒకే కొత్త సంవత్సరం అక్కడ 16 సార్లు జరుపుకుంటరు..